News November 29, 2025
బండిలో పెట్రోల్ కొట్టిన మెదక్ ఎంపీ

హత్నూర మండలం పల్పనూర్ శివారులో ఏర్పాటు చేసిన ఓ పెట్రోల్ బంకును యాజమాన్యం ఆహ్వానం మేరకు శుక్రవారం మెదక్ MP రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాల మేరకు రాత్రి, పగలు తేడా లేకుండా సిబ్బందిని అందుబాటులో ఉంచి వినియోగదారులకు ఇంధనం అందించాలన్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఓ వాహనంలో MP పెట్రోల్ కొట్టారు.
Similar News
News December 1, 2025
నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.
News December 1, 2025
ప్రకాశం: DSPని ఆశ్రయించిన ప్రేమ జంట

జలదంకి(M) లింగరాజు అగ్రహారానికి చెందిన అన్నం కార్తిక్, ప్రకాశం జిల్లా కొత్తపట్నం(M) మున్నూరుకు చెందిన సూరగం ప్రసన్న ప్రేమించుకున్నారు. వీరు ఇద్దరు మేజర్లు కావటంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా కావలి పీజీ సెంటర్ వద్ద ఉన్న శ్రీమాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో కావలి డీఎస్పీని ఆదివారం కలిసి రక్షణ కల్పించాలని కోరారు.
News December 1, 2025
హుస్నాబాద్: ‘మా ఓటు విలువైనది.. అమ్మబడదు’

హుస్నాబాద్ మండలం గాంధీనగర్కు చెందిన భోజ అనిల్ కుమార్ ఫ్యామిలీ తమ ఇంటి ముందు ‘ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు- ఆ ఓటును మేము అమ్ముకోము’ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో వారు చేసిన ఈ పనిని చూసి అందరూ సూపర్బ్ అంటున్నారు. ఓట్లు అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని వారు అంటున్నారు.


