News August 7, 2025
బక్కన్నపాలెంలో 22.64 ఎకరాలు కేటాయించాం: విశాఖ ఎంపీ

కేంద్ర మంత్రి వీరేందర్ కుమార్ను ఎంపీ శ్రీభరత్ బుధవారం కలిసి డిసెబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. గంభీరం భూమి అనువుకాదని, కొత్తగా బక్కన్నపాలెంలో 22.64 ఎకరాలు కేటాయించామని తెలిపారు. కేంద్ర-రాష్ట్ర అధికారులు పరిశీలించి ఆమోదించారని, త్వరితంగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ హబ్ దివ్యాంగ అథ్లెట్లకు శిక్షణా కేంద్రంగా మారుతుందని తెలిపారు.
Similar News
News August 10, 2025
గాజువాక సమీపంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

గాజువాక సమీపంలో జగ్గు జంక్షన్ కర్నవాణిపాలెం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ట్రాలర్ ఢీకొట్టిన ఘటనలో ఏ.మోహన్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అదే ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.
News August 10, 2025
విశాఖలోని హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు

విశాఖలోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులు గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి 44 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News August 10, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శనివారం తెలిపారు. విశాఖ-రాయపూర్ పాసింజర్ (58527/28), విశాఖ – కోరాపూట్ పాసింజర్ (58537/38), విశాఖ – భవానిపట్నం పాసింజర్ (58503/04)ను ఆగస్టు 19 నుంచి 28 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.