News June 20, 2024
బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలి: DEO
5 నుంచి15 సంవత్సరాల పిల్లలు అందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలని అల్లూరి జిల్లా DEO బ్రహ్మాజీరావు అధికారులను, హెచ్ఎంలను ఆదేశించారు. రంపచోడవరంలో గురువారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇళ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేయాలని ఆదేశించారు. ప్రతీ ఉపాధ్యాయుడు, విద్యార్థుల హాజరు నిర్ణీత సమయంలో వేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News October 4, 2024
ఏపీ టూరిజం డెవలప్మెంట్ డైరక్టర్గా బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరక్టర్గా నియమితులైన గంటా స్వరూప్ దేవి శుక్రవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు, అభిమానులు మధ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సంధర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు స్వరూప దేవికి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
News October 3, 2024
ఉమ్మడి తూ.గో.జిల్లా టాప్ న్యూస్
* జిల్లాలో రేపటి నుంచి టెట్ పరీక్షలు
* శంషాబాద్లో కోనసీమ వాసి మృతి
* రేపు తుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళా
* రాజమండ్రి: ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.కోటితో పరార్
* మంత్రి లోకేశ్ను కలిసిన ఎమ్మెల్యే చినరాజప్ప
* తూ.గో: బీజేపీలో చేరిన 300 కుటుంబాలు
* కాకినాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక బస్సులు
* ఎంపీ పురందీశ్వరికి పామాయిల్ రైతుల వినతి
* 35 రోజుల వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.1,08,89,635
News October 3, 2024
నిడదవోలులో రేపు జాబ్ మేళా
నిడదవోలు ఎస్వీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తూ.గో.జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటలకు జాబ్ మేళా మొదలవుతుందని, 5 కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. SSC, డిప్లొమా, డీఫార్మసీ, ఇంటర్, డిగ్రీ, బీ-ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ ఎం-ఫార్మసీ చదివిన 19-30 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు అర్హులన్నారు.