News July 29, 2024
బడ్జెట్పై భయమెందుకు బాబూ: మాజీ మంత్రి ధర్మాన

మోసపూరిత హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. ఈ మేరకు సోమవారం ఆయన పోలాకిలో ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా మరో 3 నెలలు ఓటాన్ అకౌంట్కు వెళ్లిందన్నారు. సూపర్ సిక్స్ను అమలు చేయకుండా ఉండేందుకు ఆయన కొత్త ఎత్తుగడ వేశారన్నారు.
Similar News
News July 6, 2025
శ్రీకాకుళం జిల్లాలో యువకుడు దారుణ హత్య

కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు (21) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ చింతాడ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
News July 6, 2025
టెక్కలిలో నకిలీ సిగరెట్ల కలకలం!

టెక్కలిలో నకిలీ సిగరెట్లు కలకలం రేపాయి. ఒరిస్సా నుంచి విచ్చలవిడిగా వస్తున్న ఈ సిగరెట్లు టెక్కలి మార్కెట్లో చాప కింద నీరులా విస్తరించాయి. ప్రధాన సిగరెట్ల కంపెనీలను పోలి ఉన్న వీటిని ఇటీవల కంపెనీ ప్రతినిధులు గుర్తించారు. వీటి ద్వారా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ఒరిస్సా నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా టెక్కలితో పాటు శ్రీకాకుళం, విశాఖకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
News July 6, 2025
ఎండాడ వద్ద రోడ్డు ప్రమాదం.. బూర్జ మండల వాసి మృతి

ఎండాడ వద్ద RTC బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో శ్రీకాకుళం(D) బూర్జ(M) ఉప్పినివలసకు చెందిన వెంకటరమణమూర్తి(45) మృతి చెందాడు. PMపాలెం CI బాలకృష్ణ వివరాల ప్రకారం.. రమణమూర్తి భార్య, పిల్లలతో కలిసి విశాఖలో ఉంటున్నాడు. శనివారం RDO ఆఫీసుకి వెంకట్రావుతో కలిసి రమణమూర్తి శ్రీకాకుళం వెళ్లారు. తిరిగి వస్తుండగా ఎండాడ వద్ద బస్సును ఓవర్టేక్ చేసే సమయంలో ప్రమాదం జరిగి రమణమూర్తి చనిపోగా వెంకట్రావు గాయపడ్డాడు.