News November 12, 2024

బడ్జెట్ కేటాయింపులో మన ఉమ్మడి తూ.గో జిల్లాకు ఎంతంటే..!

image

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఎంత నిధులు కేటాయించారంటే..(కోట్లలో)
➤జలవనరుల ప్రాజెక్టులకు: రూ. 82.77,
➤అన్నదాత సుఖీభవ: రూ. 4.500,
➤ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం: రూ.422,
➤కాకినాడ జేఎన్టీయూ: రూ. 55,
➤ఆదికవి నన్నయ యూనివర్శిటీ : రూ.11.55,
➤పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్శిటీ: రూ5.18 కోట్లు కేటాయించారు.

Similar News

News November 2, 2025

తాళ్లపూడిలో నేటి చికెన్ ధరలు ఇలా

image

కార్తీక మాసం కారణంగా తాళ్లపూడి మండలంలో మాంసం విక్రయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఆదివారం నాటికి కిలో చికెన్ రూ.200-220 పలుకుతుండగా, నాటుకోడి రూ.600, మేక మాంసం రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. కొనుగోలుదారులు గణనీయంగా తగ్గడంతో వ్యాపారం మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయగలరు.

News November 1, 2025

పుష్కర కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

image

గోకవరం మండలం తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్ప భగవాన్ (35) పుష్కర కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 1, 2025

వృద్ధుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒక వృద్ధుని ఇంటికి వెళ్లి కలెక్టర్ తన చేతుల మీదుగా పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మూర్తి, ఏడీ శశిబిందు, ఎంపీడీవో అశోక్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.