News March 11, 2025
బడ్జెట్ సమావేశాల్లో మహబూబ్నగర్ ఎంపీ

ఢిల్లీలో ప్రారంభమైన పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. వచ్చే నెల ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సెషన్స్ సాగనున్నాయి. తొలిరోజు సమావేశాల్లో పాల్గొన్న మహబూబ్నగర్ ఎంపీ మాట్లాడుతూ.. తన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
Similar News
News March 11, 2025
BNG: దారుణం.. 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
News March 11, 2025
ఈ ప్రాంతాల్లో సూర్యుడు అస్తమించడు!

రాత్రి కాగానే చీకటవ్వడం సర్వసాధారణం. కానీ సూర్యుడు అస్తమించకుండా, అర్ధరాత్రి వేళల్లోనూ ప్రకాశించే ప్రాంతాల గురించి విన్నారా? నార్వేలోని ట్రామ్సో, స్వాల్బార్డ్, ఐస్లాండ్లోని రెయ్క్జావిక్, కెనడాలోని యుకోన్, ఫిన్లాండ్, రష్యాలోని సెయింట్ పీటర్స్బెర్గ్లో సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఆ ప్రాంతాల ప్రజలు కిటికీలకు తెరలు వేసో, కళ్లకు మాస్కులు ధరించో నిద్రపోతుంటారు. కొంతమంది మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు.
News March 11, 2025
సీఎం చంద్రబాబుకు కొండా సురేఖ లేఖ

TG: తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో <<15712556>>తెలంగాణ<<>> ప్రజా ప్రతినిధుల సిఫారసులను పట్టించుకోవాలని AP CM చంద్రబాబుకు మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. ‘టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంతో గందరగోళం నెలకొంటుంది. వారి తీరుతో ప్రజాప్రతినిధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలి. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలి’ అని ఆమె చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.