News June 30, 2024

బతికున్నంత కాలం నిజాయితీగానే బతుకుతా: MLA వరద

image

తాను బతికున్నంత కాలం నిజాయితీగా బతికి చనిపోతానని MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు గీతాశ్రమంలో విశ్వహిందూ పరిషత్, ABVP, RSS, శివ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు అభినందన సభ నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాలను పునర్నిర్మిస్తామన్నారు. దేవాలయాల ఆస్తులను కాపాడుతానని, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పట్టణంలో రోడ్ల వెడల్పుకు రాజీ పడకుండా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

Similar News

News September 21, 2024

సంబేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

సంబేపల్లి మండలం బావులకాడపల్లి వద్ద బొలెరో, ఇన్నోవా, ఆటోలు ఢీకొనడంతో డ్రైవర్ జాఫర్ (48) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం రాయచోటికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలను తప్పించే ప్రయత్నంలో ఆటో నుజ్జు నుజ్జు అయింది. క్షతగాత్రులను సంబేపల్లి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News September 21, 2024

బద్వేల్: ఆత్మహత్యకు కారణమైన ఆరుగురికి జైలు శిక్ష

image

పదేళ్ల క్రితం కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ పంద్యాల వెంకట లక్ష్మమ్మ (38)ను ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన ఆరుగురికి శిక్ష పడింది. ఆ కేసు విషయంలో విచారణ జరిపిన బద్వేలు కోర్టు ఆధారాలు నిరూపితం కావడంతో ఆరుగురికి శుక్రవారం మూడేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి పద్మశ్రీ శుక్రవారం తీర్పు ఇచ్చారని, కలసపాడు ఎస్సై చిరంజీవి తెలిపారు.

News September 21, 2024

కడప: తిరుపతి సోలాపూర్ రైలు గడుపు పెంపు

image

కడప రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే సోలాపూర్-తిరుపతి- సోలాపూర్ (01437/01438) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు గడువును, డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. సోలాపూర్-తిరుపతి (01437) రైలును ఈనెల 26వ తేదీ వరకు నడపాల్సి ఉండగా డిసెంబరు 27వ తేదీ వరకు పొడిగించారన్నారు. కడప ఎర్రగుంట్ల స్టాపింగ్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.