News February 7, 2025

బతికున్న మనిషికి డెత్ సర్టిఫికెట్..!

image

మనిషి బతికుండగానే చనిపోయినట్లు సర్టిఫికెట్ సృష్టించిన ఘటన బూర్గంపాడు మండలం సారపాకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భాస్కర్ నగర్‌కు చెందిన భూక్య శ్రీరాములు పేరున ఉన్న ఎల్ఐసీ బీమా డబ్బులను కాజేసేందుకు ఏజెంట్ ఏకంగా డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఆ సర్టిఫికెట్ ద్వారా పది లక్షల భీమా సొమ్ము పొంది బాధితుడికి 3.5 లక్షలు ఇచ్చి మిగతావి ఏజెంట్ కాజేశాడు. విషయం బయటికి రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.

Similar News

News November 12, 2025

వనపర్తి: నవంబర్ 14 నుంచి ‘మిషన్ మధుమేహ-దృష్టి’

image

డయాబెటిస్ రోగులు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవాలని, ప్రారంభంలోనే సమస్యలను గుర్తిస్తే నివారించవచ్చని వనపర్తి ఇన్‌చార్జి DMHO సాయినాథ్ రెడ్డి అన్నారు. NOV 14న ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని డయాబెటిస్ రోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ‘మిషన్ మధుమేహ-దృష్టి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన శిక్షణను మంగళవారం DMHO కార్యాలయంలో నిర్వహించారు.

News November 12, 2025

జగిత్యాల: కిక్ బాక్సింగ్ లీగ్ పోస్టర్ ఆవిష్కరణ

image

జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా అస్మిత కిక్ బాక్సింగ్ లీగ్ 2025- 26 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజ గౌడ్, DRDO రఘువరన్ పాల్గొన్నారు.

News November 12, 2025

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ధరలు ఇలా

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,151, కనిష్ఠ ధర రూ.1,641; వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.1,980, కనిష్ఠ ధర రూ.1,815; వరి ధాన్యం(HMT) ధర రూ.2,055; వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,700, కనిష్ఠ ధర రూ.1,850గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.