News February 10, 2025
బత్తలపల్లి విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

విజయవాడలో ఆదివారం రాష్ట్ర స్థాయిలో వేదిక్ మ్యాథ్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో వేదిక్ మ్యాథ్స్ లెవెల్-2 విభాగంలో బత్తలపల్లికి చెందిన విద్యార్థిని అద్విక ద్వితీయ బహుమతి గెలుచుకుంది. అనంతరం విశ్వం సీఈవో హరిచరణ్ చేతులపై ప్రశంసా పత్రం, కప్పు అందుకుంది. హైద్రాబాద్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయిందని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ తెలిపారు.
Similar News
News December 26, 2025
పెద్దపల్లి: ‘ఛలో కలెక్టరేట్’ పిలుపు

ప్రభుత్వం నూతనంగా తెచ్చిన జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవో నం.252ను నిరసిస్తూ శనివారం PDPL జిల్లా కేంద్రంలో ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు TUWJ H-143 ప్రకటించింది. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నారు. జిల్లావ్యాప్తంగా జర్నలిస్టులు పెద్దసంఖ్యలో పాల్గొని ఐక్యతను చాటాలన్నారు.
News December 26, 2025
ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జరిగే CWC సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు సమాచారం.
News December 26, 2025
అసెంబ్లీకి కేసీఆర్?

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎర్రవల్లి ఫామ్హౌస్లో మాజీ మంత్రులతో సమావేశంలో చెప్పినట్లు సమాచారం. సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ఆయన కూడా అసెంబ్లీకి వచ్చి సర్కార్ను ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.


