News February 3, 2026

బద్వేల్ రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

image

బద్వేల్ రైస్ మిల్లుల్లో సోమవారం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేశారు. రైస్ మిల్లుల్లోని నిల్వలను, రికార్డులను పరిశీలించారు. మార్కెట్ సెస్ చెల్లించని సరుకును గుర్తించారు. వాటి విలువను లెక్కించారు. మిల్లుల యజమానుల నుంచి రూ.10,69,528లు వ్యవసాయ మార్కెట్ సెస్సు వసూలు చేశారు. జేడీఎం రామాంజనేయులు ఆదేశాల మేరకు జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Similar News

News February 3, 2026

కడప జిల్లాకు అలా ఆదాయం రూ.205 కోట్లు.!

image

కడప జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 31 నాటికి రూ.205 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి లభించింది. (రూ.కోట్లలో) బద్వేల్-10.71, జమ్మలమడుగు-11.74, కమలాపురం-9.53, ప్రొద్దుటూరు-46.10, మైదుకూరు-7.77, ముద్దనూరు-3.95, పులివెందుల-13.23, సిద్దవటం-2.66, వేంపల్లె-6.75, దువ్వూరు-2.79, కడప(U)-50.45, కడప(R)-39.35 ఆదాయం లభించింది.

News February 2, 2026

కడప జిల్లాలో AMCల ఆదాయం రూ.10.22 కోట్లు

image

జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 31 నాటికి AMCలు రూ.10.22 కోట్లు ఆదాయాన్ని ఆర్జించాయి. కడప-రూ.1.86 కోట్లు, ప్రొద్దుటూరు-రూ.1.20 కోట్లు, బద్వేల్-రూ.1.50 కోట్లు, మైదుకూరు-రూ.1.89 కోట్లు, జమ్మలమడుగు-రూ.69.15 లక్షలు, పులివెందుల-రూ.90.70 లక్షలు, రాజంపేట-రూ.53.25 లక్షలు, కమలాపురం-రూ.77.90 లక్షలు, సిద్దవటం-రూ.14.23 లక్షలు, ఎర్రగుంట్ల-రూ.52.71 లక్షలు, సింహాద్రిపురం-రూ.16.91 లక్షలు ఆదాయాన్ని ఆర్జించాయి.

News February 2, 2026

మైదుకూరుకు చేరుకున్న బండ్ల గణేశ్ పాదయాత్ర

image

సినీ నిర్మాత బండ్ల గణేశ్ చేపట్టిన తిరుమల పాదయాత్ర సోమవారం మైదుకూరుకు చేరుకుంది. ఈయన హైదరాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు మైదుకూరుకు చెందిన టీడీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికీ 350 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభమైందని గణేశ్ తెలిపారు. సీఎం చంద్రబాబు కోసం ఈ పాదయాత్ర చేపట్టానన్నారు. వచ్చే సోమవారం నాటికి తిరుమలకు చేరుకుంటానన్నారు.