News February 23, 2025
బయ్యారం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడులోని ఏకలవ్య పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించి, పిల్లలతో ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేసి వసతి గృహంలో అందుతున్న సేవలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పట్టుదలతో చదివి విద్యార్దులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తమకు తెలపాలని అన్నారు.
Similar News
News February 23, 2025
ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకరం: జైశంకర్

భారత ఎన్నికల్లో US నిధులను కేటాయించారన్న ట్రంప్ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర కలవరపాటుకు గురిచేశాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళన కలిగిస్తోంది. USAID నిధులపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. పూర్తి విచారణ తర్వాతే దీనిపై అన్ని వివరాలు వెల్లడిస్తాం’ అని ఆయన తెలిపారు.
News February 23, 2025
సిరిసిల్లలో రేపు ప్రజావాణి రద్దు

సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు వినతులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మహా శివరాత్రి జాతర సందర్భంగా అధికారులంతా బిజీగా ఉండటంతో ప్రజావాణి రద్దు చేశామన్నారు.
News February 23, 2025
సిద్దిపేట: బర్డ్ ఫ్లూ దెబ్బకు ప్రజల్లో ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో, చికెన్ ధరలు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.130గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.