News February 8, 2026
బలవంతంగా మతం మారిన వారిని తిరిగి తీసుకురావాలి: RSS చీఫ్

RSSలో ఏ కులానికి చెందిన వారైనా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని, బ్రాహ్మణుడిగా ఉండటం అర్హత కాదని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మాతృభాషకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇంగ్లిష్ పట్ల తమకు శత్రుత్వం లేదని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. బలవంతంగా మతం మారిన వారిని ‘ఘర్ వాపసీ’ ద్వారా తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసదారులను బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Similar News
News February 20, 2026
‘అవిశ్వాసం’పై INCని ఒంటరి చేసేలా NDA వ్యూహం

LS స్పీకర్ ఓం బిర్లాపై INC, ‘ఇండీ’ పక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై MAR 9న చర్చ, ఓటింగ్ జరగనుంది. దీన్ని తిప్పికొట్టేందుకు తగినంత బలం ఉన్నాINCని మరింత ఒంటరి చేసేలా NDA కొత్త వ్యూహంతో వెళ్తోంది. సభలో రాహుల్ను మాట్లాడనివ్వలేదన్న కారణంతో ఇచ్చిన ఈ తీర్మానంపై TMC సంతకం చేయలేదు. ఇది INC సొంత వ్యవహారంలా మారిందని ఇతర MPలూ విమర్శిస్తున్నారు. దీంతో వారి మద్దతు ఉపసంహరించేలా NDA తెరవెనుక ప్రయత్నిస్తోంది.
News February 20, 2026
ఏఐ వార్రూమ్కు HYD అనువైన ప్రదేశం: CM రేవంత్

హైదరాబాద్ వచ్చి ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో టెక్నాలజీ దిగ్గజాలను TG CM రేవంత్ కోరారు. ‘ఏఐ శకం ఇప్పటికే మొదలైంది. మనిషి కంటే ఇది ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంది. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడతారు. ఏఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్గా ఎదగాలి. ఏఐ అభివృద్ధి కోసం ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. అందుకు హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం’ అని సీఎం వివరించారు.
News February 20, 2026
రాజకీయాల్లోకి భార్య, పిల్లలను లాగొద్దు: ప్రియాంక

కాంగ్రెస్ MP గౌరవ్ గొగొయ్, ఆయన భార్య ఎలిజబెత్కు పాక్ ఏజెంట్తో <<19086206>>సంబంధాలున్నాయంటూ<<>> అస్సాం సీఎం హిమంత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక ఫైరయ్యారు. రాజకీయాల్లోకి భార్య, పిల్లలను లాగడం దుర్మార్గమన్నారు. ఎవరూ ఇలా చేయకూడదని స్పష్టం చేశారు. గౌరవ్ సానుకూల, ప్రేమపూర్వక రాజకీయాలు చేస్తారని పేర్కొన్నారు. CM అనవసర విమర్శలు వదిలేసి ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని హితవు పలికారు.


