News October 27, 2025

బల్కంపేట ఎల్లమ్మకి కార్తీక సోమవారం పూజలు

image

నగరంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలలో భక్తులతో సందడి నెలకొంది. బల్కంపేట ఎల్లమ్మ క్షేత్రంలో వేకువ జామునుంచే అమ్మవారికి అభిషేకాలు చేశారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. ఎల్లమ్మ పోచమ్మ తల్లి కరుణించవమ్మ అనే నామస్మరణతో ఆలయం మార్మోగింది. పంచ హారతుల కోసం భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి 30MIN పడుతోందని భక్తులు చెబుతున్నారు.

Similar News

News October 27, 2025

RGM: 1,000 మంది విద్యార్థులతో ఓపెన్ హౌస్..!

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సుమారు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ విధులు, షీ టీమ్స్, భరోసా, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు.

News October 27, 2025

నేరస్థులను తరలించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి: CP

image

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 86 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. పీడీ యాక్ట్, రౌడీ హిస్టరీ షీటర్లకు ఠాణాల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. నేరస్థులను ఠాణాలకు తరలించేటప్పుడు పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News October 27, 2025

అసలైన భక్తులకు ప్రతిదీ దైవమే!

image

సమస్త జీవుల్లో దేవుణ్ని చూస్తూ, వాటిని సంతోషపెట్టడమే నిజమైన ఈశ్వర పూజ. మనసులో భగవంతుణ్ని స్థాపించుకున్న భక్తులు ఉన్నత స్థితికి చేరుకుంటారు. స్థిరమైన, అవిచ్ఛిన్నమైన భక్తిని కలిగి ఉంటారు. అలాంటి భక్తులు తమ పనులన్నింటినీ భగవత్ సేవగానే భావించి, అంకితభావంతో చేస్తాడు. అందువల్ల వారికి వేరే ధ్యానం, ఆరాధన కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉండదు. అతని ప్రతి కర్మ నిరంతర పూజగా మారుతుంది.<<-se>>#Daivam<<>>