News October 20, 2025
బల్కంపేట ఎల్లమ్మ గుడిలో దీపావళి పూజలు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు, అందమైన పూలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపావళి ప్రత్యేక హారతి, ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. దీప కాంతులతో ఆలయం రూపుదిద్దుకుంది. ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
Similar News
News October 20, 2025
HYD: బాలుడి చేతిలో బ్యాగ్.. అందులో బుల్లెట్

ప్రగతినగర్లో తల్లితో ఉంటున్న ఓ బాలుడు (12)ఇంట్లో ఉండటం ఇష్టం లేక మూసాపేట మెట్రో స్టేషన్కు బ్యాగుతో వచ్చాడు. సిబ్బంది తనిఖీ చేయగా షాక్కు గురయ్యారు. అందులో 9MM బుల్లెట్ బయటపడటంతో మెట్రో స్టేషన్ ఇన్ఛార్జికి చెప్పారు. కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. గతంలో బాలుడి తాత మిలిటరీలో పనిచేసి బుల్లెట్ ఇంట్లో ఉంచగా తెచ్చుకున్నాడని తేలింది. కేసు నమోదు చేసినట్లు SI గిరీష్ తెలిపారు.
News October 20, 2025
ఖైరతాబాద్లో రేపు సాయంత్రం సదరోత్సాహం

ఖైరతాబాద్లో రేపు సదర్ సందడి ఉంటుంది. సా.7 గంటలకు ఖైరతాబాద్ లైబ్రరీ వద్ద ఈ వేడుక నిర్వహిస్తారు. దీపావళి పండుగ మరుసటి రోజున ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ అని.. 8 దశాబ్దాలుగా సదర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళారపు చౌదరి యాదయ్య యాదవ్ తెలిపారు. స్థానికులు వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
News October 20, 2025
HYD: సెంచరీకి మరో ఆరు.. రేపు పూర్తయ్యే అవకాశం

మీరు చదివింది నిజం.. సెంచరీకి మరో ఆరుమంది దూరంగా ఉన్నారు. అయితే అది క్రికెట్లో కాదండి.. ఎన్నికల్లో. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారు నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 94 మంది నామినేషన్లు సమర్పించారు. ఇక కేవలం 6 వేస్తే వీరి సంఖ్య 100కు చేరుకుంటుందన్నమాట. నామినేషన్ల దాఖలుకు రేపు చివరి రోజు కావడంతో ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో అని ప్రజలతోపాటు అధికారులు ఎదురుచూస్తున్నారు.