News July 7, 2025
బల్దియా కౌన్సిల్ సమావేశానికి మంత్రి సురేఖ గైర్హాజరు

వరంగల్ మునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా మంత్రి కౌన్సిల్ సమావేశానికి రాలేకపోయారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా కౌన్సిల్ సమావేశంలో మేయర్ సుధారాణి అధికారికంగా బల్దియా బడ్జెట్ను ప్రకటించారు.
Similar News
News July 7, 2025
ధర్మవరంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

ధర్మవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణా తరగతులు ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేష్ బాబు సోమవారం తెలిపారు. ఈనెల 16 నుంచి ఎంఐఎస్ డేటా అనలిస్ట్ – ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్స్ ప్రారంభిస్తామన్నారు. ఆసక్తి ఉన్న యువత వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.
News July 7, 2025
ఓపెన్ స్కూల్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి: సంగారెడ్డి కలెక్టర్

చదువు మధ్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ చదువుకునే అవకాశం ఉందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఓపెన్ స్కూల్ కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాయడం, చదవడం వచ్చిన మహిళా సంఘాల సభ్యులను చేర్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఈఓ వెంకటేశ్వర్లు, ఓపెన్ స్కూల్ సమన్వయకర్త వెంకటస్వామి పాల్గొన్నారు.
News July 7, 2025
ప్రకాశం: 10 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి

ప్రకాశం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న 10 మందికి ఏఎస్ఐలుగా పదోన్నతి వచ్చింది. వీరిని ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ మేరకు వారి పదోన్నతికి సంబంధించిన పత్రాలను అందించి ఎస్పీ పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన ప్రతి ఒక్కరు విధి నిర్వహణలో పేరు ప్రఖ్యాతలు సాధించాలన్నారు.