News October 24, 2025
బస్సు ప్రమాదంలో.. పటాన్చెరు వాసులు మృతి

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 24, 2025
జూబ్లీ బైపోల్: మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి!

జూబ్లీ బైపోల్ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు ఓటర్లు తెలుసుకునేలా ECI అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ECINET మొబైల్ యాప్లో అందుబాటులో ఉన్న ‘Know Your Candidate’ మాడ్యూల్ ద్వారా ఓటర్లు.. పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, కేసులు వంటి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఓటర్లు Android, iOSలో ECINET యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
SHARE IT
News October 24, 2025
జూబ్లీహిల్స్ బస్తీల్లో మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె బోరబండలోని సైట్ 3 ప్రాంతంలో పర్యటించి ఇంటింటికీ ప్రచారం చేశారు. కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. రూ.కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు గుర్తు చేశారు.
News October 24, 2025
బొమ్మల కొలువులో సచివాలయం, బిర్లా మందిర్

దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి కొలువుదీరేలా బొమ్మల కొలువు రూపొందించి అందులో తెలంగాణ సచివాలయ భవనం, బిర్లా మందిర్ నమూనాలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో నివసించే విజయ్ కుమార్ ఏటా ఇలా వినూత్నంగా కొత్త డిజైన్లతో బొమ్మలతో రూపొందిస్తుంటారు. అత్యంత ఆకర్షణంగా ఉన్న ఈ బొమ్మలను చూడటానికి వచ్చిన ప్రజలు విజయకుమార్ కళను అభినందిస్తున్నారు.


