News December 12, 2025

బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి హోంమంత్రి

image

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన <<18539765>>బస్సు ప్రమాద<<>> స్థలానికి హోం మంత్రి అనిత హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి.. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి సంధ్యారాణి సైతం ఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.

Similar News

News December 12, 2025

నేడు మొక్కజొన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులు

image

TG: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన నగదును ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 55,904 మంది అన్నదాతలకు రూ.585 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు 2.45 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను ప్రభుత్వం సేకరించింది. క్వింటాకు రూ.2,400 చొప్పున అందజేయనుంది. కాగా కేంద్రం సహకరించకపోయినా రైతులు నష్టపోకూడదని తామే పంటను సేకరిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

News December 12, 2025

నితీశ్ హ్యాట్రిక్

image

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టారు. ఆంధ్రా జట్టుకు ఆడుతున్న ఆయన మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీశారు. మూడో ఓవర్ 4, 5, 6 బంతులకు వరుసగా హర్ష్, హర్‌ప్రీత్ సింగ్, రజత్ పాటీదార్‌లను పెవిలియన్‌కు పంపించారు. కాగా తొలుత ఆంధ్రా 19.1 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ ఆటగాళ్లు తడబడుతున్నారు.

News December 12, 2025

మహిళలకు త్వరలో ఆర్టీసీ స్మార్ట్ కార్డులు!

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ చేసేందుకు RTC కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో మహిళలకు అందించిన ‘సహేలీ’ తరహా కార్డులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ఈ కార్డులపై లబ్ధిదారుల ఫొటో, వివరాలు ఉంటాయి. ఈ కార్డులు వస్తే ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులు చూపించాల్సిన అవసరం తప్పనుంది.