News November 3, 2025

బస్సు ప్రమాదం.. పటాన్ చెరు నుంచి వెళ్లిన టిప్పర్

image

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద ఆర్టీసి బస్సు ప్రమాదంలో 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణమైన టిప్పర్ పటాన్ చెరు లక్డారం క్రషర్ నుంచి బయలుదేరినట్లు సమాచారం. గత కొన్ని రోజుల కింద జరిగిన కర్నూల్ బస్సు ప్రమాదం కూడా ట్రావెల్స్ బస్సు పటాన్ చెరు నుంచి బయలుదేరిందని, పటాన్ చెరు నుంచి బయలుదేరే వాహనాలు మృత్యువును వెంటాడుతున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Similar News

News November 3, 2025

ప్రజా వినతులను వేగవంతంగా పరిష్కరించండి: కలెక్టర్

image

ప్రజల వినతులను త్వరితగతిన పరిష్కరించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజల నుంచి వచ్చిన వినతులను వేగంగా పరిష్కరించాలని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం నంద్యాల పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ భవనంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

News November 3, 2025

యాక్సిడెంట్ల రికార్డులు లేవన్న TGSRTC.. విమర్శలు

image

TG: చేవెళ్ల RTC బస్సు ప్రమాదంలో 19 మంది మరణించడం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలపై OCTలో వివరాలు అడిగిన ఓ RTI కార్యకర్తకు తమ వద్ద అలాంటి రికార్డులు లేవని RTC చెప్పింది. ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నా రికార్డులు నిర్వహించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అయితే 2017-21 వరకు 2,674 ఘటనల్లో 1,230 మంది మృతి చెందారని 2022లో ఓ దరఖాస్తుకు RTC సమాధానమిచ్చింది. ఇప్పుడు రికార్డులే లేవనడం చర్చనీయాంశంగా మారింది.

News November 3, 2025

VJA: వన్ హెల్త్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ

image

జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల నివారణ లక్ష్యంగా ఒకే ఆరోగ్యం (వన్ హెల్త్) అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి ప్రారంభించారు. ప్రతి ఏటా నవంబర్ 3న వన్ హెల్త్ డే జరుపుకుంటారని చెప్పారు.