News December 31, 2025

బహుమతులు వద్దు.. సేవలే ముద్దు: సత్యసాయి కలెక్టర్

image

న్యూ ఇయర్ సందర్భంగా పూలబొకేలు, శాలువాలు, కేకులు తీసుకురావద్దని సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. వీటి బదులు విద్యార్థులకు పుస్తకాలు, నిరుపేదలకు బెడ్‌షీట్లు, టీబీ రోగులకు పోషకాహార కిట్లు అందించాలని సూచించారు. సమాజంలోని అణగారిన వర్గాలకు సేవ చేయడమే నిజమైన శుభాకాంక్షలని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారానే సమాజానికి మేలు జరుగుతుందని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

Similar News

News January 8, 2026

నేడు ఈ వస్తువులు దానం చేస్తే అదృష్టం

image

విష్ణువుకు ఇష్టమైన గురువారం నాడు పసుపు రంగు వస్తువులు దానమిస్తే జాతకంలో బృహస్పతి దోషాలు తొలగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని నమ్మకం. పేదలకు పసుపు వస్త్రాలు, పప్పు ధాన్యాలు, అరటిపండ్లు, పసుపు మిఠాయిలను దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల వృత్తిలో పురోగతి లభించడమే కాకుండా, ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని అంటున్నారు. స్తోమతను బట్టి చేసే దానం, విష్ణుమూర్తి కృపతో శుభాలను చేకూరుస్తుంది.

News January 8, 2026

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం

image

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను జనవరి 17న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గువాహటి-కోల్‌కతా రూట్‌లో 18 నుంచి పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. 16 కోచ్‌లు, 823 సీట్లు కలిగిన ఈ ట్రైన్‌లో విమాన తరహా సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. మధ్యతరగతి ప్రయాణికుల కోసం టికెట్ ధరలు రూ.2,300-3,600 మధ్య నిర్ణయించారు. గంటకు 180 KM వేగంతో దూసుకెళ్లనుంది.

News January 8, 2026

శకటాలను అందంగా తయారుచేయండి: జేసీ

image

నెల్లూరులో రిప్లబిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల పరిశుభ్రతతో పాటు భద్రతకు ప్రాధాన్యమివ్వాలని పోలీస్ శాఖకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా, విజ్ఞానదాయకంగా తయారుచేసి ప్రదర్శించాలని కోరారు.