News February 18, 2025
బహుళ పంటల విధానంపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి: కలెక్టర్

లాభదాయక సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకృతి సేద్యానికి, మిల్లెట్లు, బహుళ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామాలల్లో ప్రతి ఇంటి వద్దా కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంపకం చేసేలా అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News February 20, 2025
విశాఖ టుడే టాఫ్ న్యూస్

☞ విశాఖ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు ☞గంజాయి తాగినా రౌడీషీట్: విశాఖ DIG ☞కనకమహాలక్ష్మి సేవలో విదేశీ యువతులు ☞విశాఖ: VRS చేస్తే రూ.50 లక్షలు..! ☞ రైల్వే లోకో రన్నింగ్ స్టాఫ్ ధర్నా ☞విశాఖలో డివైడర్ను ఢీకొట్టిన కారు ☞విశాఖ: జనారణ్యంలోకి వచ్చిన దుప్పి ☞హైదరాబాద్లో విశాఖ యువకుడి మృతి ☞ఆనందపురం: ఆవు పొట్టలో 50 కేజీల ప్లాస్టిక్ ☞విశాఖలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలు
News February 20, 2025
విశాఖ: తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు

గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు సంబంధించి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. మాస్ కాపీయింగ్ లేదా ఇతర సంఘటనలు జరిగాయని పేర్కొంటూ ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు వార్తలను, సమాచారాన్ని చేరవేసే వారిపై నిఘా ఉంటుందన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
News February 20, 2025
విశాఖ: 16 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహణ

ఫిబ్రవరి 23న జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ -2 పరీక్ష జరగనుందని, పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ వీసీ హాలులో జిల్లా అధికారులు, ఏపీపీఎస్సీ అధికారులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.