News April 16, 2025
బాచుపల్లి: నమ్మించి మోసం చేశాడు

పెళ్లికాలేదు.. నిన్నే చేసుకుంటా అని నమ్మించి యువతి (21)ని గర్భవతిని చేసి మొహం చాటేశాడో కామాంధుడు. ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా కటకటాల పాలయ్యాడు. సీఐ ఉపేందర్ మాటల్లో.. ఇల్లెందుకు చెందిన బి.ఏసుదాస్ డేవిడ్ (43) మల్లంపేటలో ఉంటూ ఓ యువతిని ప్రేమిస్తున్నాను అంటూ మల్లంపేటలోని హోటళ్లకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేగా మొహం చాటేశాడు.
Similar News
News February 20, 2026
HYD: మ్యారేజ్ లైఫ్లో పాత పద్దతులకు చెక్

సర్దుకుపోవడం అంటే ఆత్మగౌరవాన్ని కోల్పోవడమే కాదని యువత వివాహ వ్యవస్థలో పాత ధోరణులను పక్కన పెడుతున్నారు. పెళ్లి సామాజిక బాధ్యతే కాదని, ఇద్దరు వ్యక్తుల మధ్య సమానత్వం, గౌరవ బంధమని నమ్ముతున్నారు. నచ్చిన భాగస్వామిని ఎంచుకునే, జీవించే హక్కు ఉందని రాజ్యాంగం చెబుతోంది. బలవంతపు సర్దుబాట్లు ఒత్తిడికి దారితీస్తున్న తరుణంలో, యువత తమ కెరీర్, ఆన్లైన్ కమ్యూనిటీలతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంటున్నారు.
News February 20, 2026
HYD: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

HYD నగర శివారులో నిర్వహించిన ఈగల్ ప్రత్యేక తనిఖీల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖాజా వహాబుద్దీన్ పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి రూ.14 లక్షల విలువైన 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో 43 కేసులు ఉండగా.. నాలుగు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. జనవరి నుంచి ఈగల్ ఫోర్స్ మొత్తం 225 మంది పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంది.
News February 19, 2026
కీసరగుట్ట హుండీ ఆదాయం ₹92,70,762

కీసరగుట్టలో 6 రోజులపాటు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులు స్వామివారికి కానుకలుగా సమర్పించిన హుండీ ఆదాయాన్ని గురువారం దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో లెక్కించారు. హుండీ ద్వారా ₹92,70,762 ఆదాయం వచ్చిందని ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ, EO సుధాకర్ రెడ్డి స్పష్టంచేశారు. ఈ ఏడాది 20,801 ఆదాయం పెరిగిందన్నారు. హుండీ లెక్కింపులో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.


