News October 4, 2025
బాణాసంచా గోడౌన్లను తనిఖీ చేసిన జేసీ మేఘ స్వరూప్

దీపావళి బాణాసంచా తయారీ, అమ్మకాలకు సంబంధించి కచ్చితంగా లైసెన్సులు తీసుకోవాలని జేసీ మేఘ స్వరూప్ స్పష్టం చేశారు. శుక్రవారం అధికారులతో కలిసి ఇటీవల దరఖాస్తు చేసుకున్న బాణాసంచా గోడౌన్లను ఆయన తనిఖీ చేశారు. గోదాముల వద్ద భద్రతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. భద్రత ప్రమాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ మెరికమ్మ, ఇతర అధికారుల ఆయన వెంట ఉన్నారు.
Similar News
News October 3, 2025
కొవ్వూరు: ‘గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి’

కొవ్వూరు మండలంలో గృహ నిర్మాణాల పురోగతిపై జిల్లా గృహ నిర్మాణాధికారి బుజ్జి శుక్రవారం సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ ఆఫీస్లో నియోజకవర్గంలోని హౌసింగ్ అధికారులతో నిర్మాణాలను దశలవారీగా చర్చించారు. త్వరలో సీఎం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను సామూహిక గృహప్రవేశాలు చేయనందున నిర్మాణ పనులు వేగ వంతం చేయాలని ఆదేశించారు. ఈఈ సీహెచ్ వేణుగోపాలస్వామి, డీఈఈ శేఖర్ బాబు, ఏఈలు పాల్గొన్నారు.
News October 3, 2025
21 రహదారుల విస్తరణకు ప్లాన్ సిద్ధం చేయాలి: కలెక్టర్

గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి నగరపాలక సంస్థ తరఫున ప్రతిపాదనలను సహేతుకంగా రూపొందించి నివేదించాలని కలెక్టర్, కమిషనర్ (F.A.C) కీర్తి చేకూరి అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం సమీక్ష చేశారు. తొలుత 21 రహదారుల విస్తరణకు సంబంధించి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
News October 3, 2025
రాజమండ్రి: ఆటో డ్రైవర్లకు రూ.17 కోట్ల 87 లక్షల ఆర్థిక సాయం

ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఆటో డ్రైవర్లు సేవలో” పథకం కింద తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 11,915 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారని జిల్లా రవాణా అధికారి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో ఆటో డ్రైవర్కు రూ.15,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మొత్తం రూ.17,87,25,000ల మేర ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.