News November 29, 2024
బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి: ఎంపీ

పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ పరిశ్రమలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించాలని ఎక్స్లో పేర్కొన్నారు.
Similar News
News September 19, 2025
మేయర్, కమిషనర్ ప్రజలతో ఆటలాడటం తగదు: ఎమ్మెల్యే వంశీకృష్ణ

జైలు రోడ్డు ఫుడ్ కోర్ట్లో దుకాణాలను స్థానిక MLA అయిన తనకు సమాచారం ఇవ్వకుండా <<17758951>>తొలగించడం<<>>పై వంశీకృష్ణ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ప్రజలతో ఆటలాడటం తగదని హెచ్చరించారు. ఫుడ్ కోర్ట్ వ్యాపారులు ఏళ్లుగా కష్టపడి దుకాణాలు నడుపుతున్నారని, ఒక్కసారిగా తొలగించడం అన్యాయం అని అన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్లో తీర్మానం పెట్టడాన్ని తప్పుపట్టారు.
News September 19, 2025
విశాఖలో వెహికల్ రిటర్న్ మేళా

విశాఖ నగరంలో వివిధ కారణాలవల్ల స్వాధీనం చేసుకున్న వాహనాలను సీపీ వాహనదారులకు తిరిగి అందజేశారు. పోలీస్ గ్రౌండ్లో శుక్రవారం సీపీ శంఖబ్రత బాగ్చి 346 వాహనాలను వాహనదారులకు అందజేశారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టినట్లు సీపీ తెలిపారు. ఇప్పటివరకు మూడు వెహికల్ రిటర్న్ మేళా నిర్వహించి 818 మందికి వారి వాహనాలు అందించినట్లు వెల్లడించారు.
News September 19, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్కు ఢిల్లీ అధికారులు

ఢిల్లీ నుంచి స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, జాయింట్ సెక్రెటరీలు విశాఖ చేరుకున్నారు. వారు విశాఖ స్టీల్ ప్లాంట్ను నేడు సందర్శించనున్నారు. ఉత్పత్తి తగ్గుదల, బొగ్గు సమస్యపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం ఎంపిక చేసిన అధికార ఉద్యోగ బృందాలతో సమావేశమౌతారు. స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజీ ఇచ్చిన తర్వాత ప్రతి మూడు నెలలకోసారి సమీక్షల్లో భాగంగా వస్తున్నట్లు సమాచారం.