News October 19, 2024
బాన్సువాడ: కొడుకును వాగులో తోసేశానన్న తండ్రి.. ఆందోళనలో తల్లి

బాన్సువాడ మండలం దేశాయిపేటకు చెందిన రాములు తన కొడుకు పండరి (14) ను వాగులో తోసేసినట్లు భార్య గంగమణితో పేర్కొన్నాడు. కాగా ఆమె వాగు వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనపడలేదు. దీంతో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను విచారించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది. కొడుకును దాచి పెట్టాడా..? లేక నిజంగానే వాగులో పడేశాడా..? అనేది తెలియాల్సి ఉంది.
Similar News
News December 18, 2025
నిజామాబాద్: శాంతియుతంగా పూర్తి: సీపీ

ప్రజల సంపూర్ణ సహకారంతో గ్రామ పంచాయితీ ఎన్నికలు శాంతియుతంగా పూర్తయ్యాయని సీపీ సాయి చైతన్య తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి డిసెంబర్ 17 వరకు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో అన్ని స్థాయిల పోలీసు సిబ్బంది అంకితభావంతో కృషి చేశారని వెల్లడించారు. ప్రజలు-పోలీసుల మధ్య ఉన్న సమన్వయమే ఈ విజయానికి ప్రధాన కారణమన్నారు.
News December 18, 2025
NZB: BJP సర్పంచ్లు ఎంతమంది గెలిచారంటే!

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 84 మంది సర్పంచులు BJP తరఫున గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 34 మండలాలు, 642 గ్రామ పంచాయతీల్లో BJP మద్దతుదారులు 299 GPల్లో పోటీ చేసి 84 గ్రామ పంచాయతీల్లో గెలిచారు. ఎంపీ అర్వింద్ తమకు అండదండలు ఇవ్వడంతో పాటు గ్రామస్థులు మద్దతు పలికారని గెలిచిన వారన్నారు.
News December 18, 2025
NZB: ఫుడ్ పాయిజన్తో విద్యార్థిని మృతి

మెండోరా(M) పోచంపాడులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ముప్కాల్కు చెందిన సాయి లిఖిత HYD చికిత్స పొందుతూ మరణించింది. ఈ నెల 5న బాలిక వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫుడ్ పాయిజన్ జరిగిందని, ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాలఎదుట మృతదేహంతో నిరసనకు యత్నించారు.


