News July 5, 2025
బాపట్లలో ఎలక్ట్రికల్ ఆటోల అందజేత

ప్రజల జీవనోపాధులు మెరుగుపరచుకోవడానికి మెప్మా శాఖ ద్వారా చీరాల మండలంలో 2, బాపట్ల మండలంలో 2 ఎలక్ట్రికల్ ఆటోలను ముద్రా రుణం కింద కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ లబ్ధిదారులకు అందజేశారు. ఒక్కొక్క యూనిట్ ఖరీదు రూ.3.63 లక్షలు అన్నారు. ఈ వాహనాలను రాపిడో సంస్థతో అనుసంధానించడం ద్వారా లబ్ధిదారులకు రూ.56 వేల ప్రోత్సాహకం అందజేస్తామన్నారు.
Similar News
News July 5, 2025
టెట్ ప్రిలిమినరీ కీ విడుదల

తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదలైంది. ఈ నెల 8 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని అధికారులు పేర్కొన్నారు. గత నెల 18 నుంచి 30 వరకు 9 రోజుల పాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్-1కు 74.65శాతం, పేపర్-2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 73.48, పేపర్-2(సోషల్ స్టడీస్)కు 76.23శాతం అభ్యర్థులు హాజరయ్యారు. కీ కోసం ఇక్కడ <
News July 5, 2025
సూర్యాపేట: శ్రీనివాస్ మృతి.. రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి

మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కుర్రి శ్రీనివాస్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసందే. ఈరోజు నకిరేకల్ ప్రభుత్వ వైద్యశాలలో ఆయన మృతదేహానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు. ఇద్దరు కూతుళ్లు ఉన్న శ్రీనివాస్ కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.10లక్షలు ప్రకటించారు. శ్రీనివాస్ భార్యకు ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
News July 5, 2025
ఈ నెల 15, 16 తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు

AP: ఈ నెల 15, 16 తేదీల్లో తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజుల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివార ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే 14 ,15 తేదీల్లో ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే సిఫారసులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.