News January 24, 2025

బాపట్లలో కళాశాల బస్సు బీభత్సం

image

చీరాల నుంచి కర్లపాలెం వైపు వస్తున్న ఓ కళాశాల బస్సు శుక్రవారం బీభత్సం సృష్టించింది. సదరు బస్సు బాపట్ల మండలం నందిరాజుతోట వద్ద కూరగాయల బండిని, హైదరుపేట వద్ద బైకును, సత్యవతిపేట వద్ద స్కూటీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకులు దెబ్బతినడంతోపాటు ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 21, 2026

విజయవాడలో డిజిటల్ అరెస్టు పేరుతో భారీ మోసం

image

విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం జరిగింది. విశ్రాంత ఉద్యోగికి ఓ వ్యక్తి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి మాట్లాడుతున్నామని వీడియో కాల్ చేసి బెదిరించాడు. రూ.72.50 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో ఆయన SBI బ్రాంచ్‌కు వెళ్లారు. అనుమానంతో పోలీసులు వచ్చి ఖాతా కోల్‌తాకు చెందినదని గుర్తించి లావాదేవీ ఆపేశారు. 15 రోజులకు మళ్లీ కాల్ రావడంతో నిజమే అనుకుని మోసగాళ్ల ఖాతాకు రూ.49 లక్షలు బదిలీ చేశారు.

News February 21, 2026

నిర్మల్: ముగిసిన ఎన్నికలు.. అందని భరోసా!

image

రబీ సాగు పెట్టుబడుల కోసం నిర్మల్ జిల్లా రైతాంగం రైతు భరోసా నిధుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. డిసెంబర్‌లోనే విడుదల కావాల్సిన ఈ నిధులు, మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం అయ్యాయి. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా, వారం గడుస్తున్నా అతీగతీ లేదు. జిల్లాలోని లక్షకు పైగా రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 21, 2026

కాకినాడకు కొత్త ఎయిర్‌పోర్ట్.. తుని-అన్నవరం మధ్యే ఫిక్స్!

image

రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 9 ఎయిర్‌పోర్టులు నిర్మించే ప్రణాళికలో భాగంగా కాకినాడ జిల్లా తుని – అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. తొలుత కరప మండలం గురజానాపల్లిలోని సాల్ట్ భూములను పరిశీలించినా, సాంకేతిక కారణాలతో తుని ప్రాంతాన్ని ఎంపిక చేస్తూ డీపీఆర్ సిద్ధం చేశారు. ఇక్కడ భూసేకరణ వల్ల ఆర్థిక భారం పడినా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఇక్కడే నిర్మాణానికి అంగీకరించింది.