News February 15, 2026

బాపట్లలో పండగ పూట విషాదం

image

బాపట్లలో పండగపూడ విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు కారుమూరి సతీష్ (35) విద్యుత్ షాక్‌తో మరణించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సతీష్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌గా పనిచేస్తూ అందరికి సుపరిచితుడయ్యాడన్నారు. యువ నాయకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Similar News

News February 21, 2026

సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రపై నాసా సంచలన రిపోర్టు!

image

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ <<15733376>>అనివార్య కారణాలతో<<>> కొన్ని నెలలు స్పేస్‌లోనే ఉండిపోవడం తెలిసిందే. దీనిపై నాసా సంచలన రిపోర్టు రిలీజ్ చేసింది. స్టార్ లైనర్ వ్యోమనౌక తీవ్ర సాంకేతిక వైఫల్యాలకు లోనైందని తెలిపింది. అది ప్రాణాంతక వైఫల్యమని పేర్కొంటూ టైప్-ఏ ప్రమాదంగా వర్గీకరించింది. భద్రతాపరమైన ప్రొటోకాల్స్‌ను పక్కనపెట్టి ప్రయోగాన్ని చేపట్టేందుకు నాసా మేనేజర్లపై ఒత్తిడి తెచ్చినట్లుగా గుర్తించింది.

News February 21, 2026

సునీతా విలియమ్స్ యాత్ర.. అప్పుడేమైంది?

image

నాసా రిపోర్టు ప్రకారం.. 2024 జూన్‌లో వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లగానే దానిని నడిపించే ప్రొపల్షన్ వ్యవస్థలో సమస్య వచ్చింది. ISSకు చేరుకునే సరికి 5 థ్రస్టర్లు/మినీ ఇంజిన్లు పని చేయడం ఆగిపోయాయి. హీలియం లీకేజ్ మొదలైంది. అయితే డాకింగ్ జరగడంతో వ్యోమగాములు ISSలోకి వెళ్లగలిగారు. స్టార్ లైనర్‌ను ఖాళీగానే కిందికి తీసుకొచ్చారు. చివరికి 2025 మార్చిలో స్పేస్ ఎక్స్ నౌకలో సునీత, విల్మోర్ భూమికి చేరుకున్నారు.

News February 21, 2026

టైప్-ఏ ప్రమాదమంటే?

image

ఒక ప్రమాదానికి ఇచ్చే తీవ్రమైన లేబుల్ ‘టైప్ ఏ’. భారీగా ఆర్థిక, ప్రాణనష్టం వంటి పరిణామాలకు కారణమైనప్పుడు ‘టైప్-ఏ’గా నాసా పరిగణిస్తుంది. ఛాలెంజర్, కొలంబియా షటిల్ ప్రమాదాలు ఈ కేటగిరీలోకే వస్తాయి. 2003లో కొలంబియా స్పేస్ షిప్ భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు పేలిపోయింది. దీంతో భారత సంతతి వ్యోమగామి కల్పనా చావ్లా, మరో ఆరుగురు చనిపోయారు. ఛాలెంజర్ (1986) షటిల్ డిజాస్టర్‌లో ఏడుగురు చనిపోయారు.