News January 14, 2026
బాపట్లలో రాష్ట్రస్థాయి ఎడ్ల ప్రదర్శన

సంక్రాంతి సందర్భంగా బాపట్లలో 16వ రాష్ట్రస్థాయి ఎడ్ల ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. బీమావారిపాలెం రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మున్నంవారిపాలెం రోడ్డులో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, డీఎస్పీ రామాంజనేయులు పోటీలను ప్రారంభించారు. పండగ పూట నిర్వహించిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు జనం ఆసక్తి చూపారు.
Similar News
News February 6, 2026
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టుల కింద పెండింగ్లో ఉన్న భూసేకరణ, పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అవార్డు దశలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నిధుల విడుదల కోసం పెండింగ్ వివరాలను అందజేయాలని అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల కల్పనలో జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు.
News February 6, 2026
నిజాంసాగర్: పరీక్షా విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: DEO

నిజాంసాగర్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల ప్రవేశ పరీక్ష నిర్వహణపై గురువారం ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ సీతా రాంబాబు మాట్లాడుతూ.. పరీక్షా నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. సెంటర్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు పరీక్షా నిబంధనలు, పారదర్శకతపై DEO రాజు దిశానిర్దేశం చేశారు. పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం చేయాలన్నారు.
News February 5, 2026
ఎల్లారెడ్డి: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పరిశీలించిన జిల్లా నోడల్ అధికారి

ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను గురువారం జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, ఆర్డీఓ పార్థ సింహారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన మొదటి విడత పరీక్షలు ప్రశాంతంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని వారు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.


