News February 13, 2025
బాపట్ల: అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య

సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు ఎన్ఎస్పీ కాలువ వద్ద అప్పుల బాధతో విత్తనాల వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు పసుమర్తిపాలెంకు చెందిన సుబ్బారెడ్డిగా సంతమాగులూరు పోలీసులు గుర్తించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News November 1, 2025
విశాఖ: హత్య చేసి స్వామీజీ అవతారమెత్తాడు

విశాఖ స్ర్పింగ్ రోడ్డుకు చెందిన యుగంధర్ 2021లో అదే ప్రాంతానికి చెందిన సుబ్బారెడ్డిని కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు అరెస్టు చేసి రౌడీషీట్ ఓపెన్ చేశారు. బెయిల్పై బయటకొచ్చి కోర్టుకు హాజరవ్వకపోవడంతో అతనిపై నాన్బెయిల్బుల్ వారెంట్ జారీ అయ్యింది. హిమాలయాల్లో భైరవస్వామిగా మారువేషంలో యుగంధర్ ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. 2టౌన్ CI ఎర్రంనాయుడు, SIలు మన్మథరావు, సతీశ్ను సీపీ అభినందించారు.
News November 1, 2025
జగిత్యాల మార్కెట్లో నేటి దినుసుల ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర ₹2051, కనిష్ఠ ధర ₹1716, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర ₹1871, కనిష్ఠ ధర ₹1725, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర ₹2511, కనిష్ఠ ధర ₹2251, వరి ధాన్యం (BPT) ధర ₹2031, కనిష్ఠ ధర ₹2021గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు. అటు మార్క్ఫెడ్ ద్వారా 196.00 క్వింటాళ్ల మక్కల కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు.
News November 1, 2025
NFCలో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీ

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) హైదరాబాద్లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి, ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. నెలకు రూ.9,600-10,560 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు <


