News March 13, 2025

బాపట్ల: ఆర్టీసీ బస్సుల్లో టెన్త్ విద్యార్థులకు ఫ్రీ జర్నీ

image

ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బాపట్ల జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 16,799 (8482 విద్యార్థులు, విద్యార్థినిలు 8317) మంది 103 పరీక్ష కేంద్రాలలో పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికి హాల్ టికెట్‌పై ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు.

Similar News

News March 13, 2025

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ధ్రువీకరణ పత్రం

image

ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గురువారం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

News March 13, 2025

శ్రీ సత్యసాయి: 15న స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

image

స్వచ్ఛ ఆంధ్ర, హరితాంద్ర, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ శనివారం నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ప్రధాన అంశంగా కార్యక్రమం జరుగుతుందన్నారు.

News March 13, 2025

పద్మనాభం: భూములు పరిశీలించిన జేసీ మాయూర్ అశోక్

image

పద్మనాభం మండలంలోని కృష్ణాపురం, రెడ్డిపల్లి గ్రామాల్లో పారిశ్రామిక (ఎంఎస్ఎంఈ) పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వ భూములను గురువారం జాయింట్ కలెక్టరు మయూర్ అశోక్ పరిశీలించారు. తహసీల్దారు కె.ఆనందరావుతో కలిసి ఆయా గ్రామాల్లోని భూములను పరిశీలించారు. వాటి రికార్డులు, భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని అవకాశాలు కుదిరితే ఈ భూములను ఏపీఐఐసీకి బదలాయించి పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలన్నారు.

error: Content is protected !!