News April 19, 2025
బాపట్ల: ఉద్యోగాల పేరిట రూ.1.5కోట్ల వసూలు.. మోసగాడి అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసి రూ.1.5 కోట్లకు పైగా వసూలు చేసిన వ్యక్తిని తెనాలి త్రీటౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అమరావతి కాలనీకి చెందిన తేజ కృష్ణ కమల్ తాను ఏపీ సెక్రటేరియట్లో ఏఎస్ఓగా పని చేస్తున్నానంటూ ఫేక్ ఐడీలతో నమ్మించి ఉద్యోగాలు పేరిట మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.1.5 కోట్లు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
Similar News
News December 23, 2025
వారు ఆ టైంలోనే తిరుమలకు రావాలి: BR నాయుడు

AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తామని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. ‘DEC 30 నుంచి JAN 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నాం. 10 రోజులలో మొత్తం 182గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే కేటాయించాం. ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన వారు తప్పనిసరిగా నిర్దేశిత తేదీ, టైంలోనే తిరుమలకు చేరుకోవాలి. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు.
News December 23, 2025
ఉష్ణోగ్రత ఎంత ఉంటే.. చలి అంత ఉన్నట్టా?

ఉష్ణోగ్రత ఎంత తగ్గితే చలి తీవ్రత అంత ఎక్కువ అవుతుందనేది ఒకింత నిజమే. అయితే టెంపరేచర్ ఒక్కటే చలిని నిర్ణయించదు. వాతావరణంలోని తేమ, ఎండ.. ముఖ్యంగా గాలి వేగం ప్రభావితం చేస్తాయి. థర్మామీటర్ చూపే ఉష్ణోగ్రత కంటే గాలి వేగం ఎక్కువగా ఉంటే శరీరం నుంచి వేడి త్వరగా పోయి మరింత చల్లగా అనిపిస్తుంది. ఉదాహరణకు గాలి లేకుండా 0°C ఉంటే చల్లగా ఉంటుంది. అదే 0°Cకి 40kmph గాలి కలిస్తే -10°C లాగా అనిపిస్తుంది.
News December 23, 2025
ఆదిలాబాద్: INTER విద్యార్థులకు గమనిక

ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించని వారికి బోర్డు మరొక అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 16తోనే ఫీజు చెల్లింపు గడువు ముగియగా దానిని ఈ నెల 31 వరకు అపరాధ రుసుము రూ.2000తో పొడగించినట్లు తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫీజు చెల్లించాలని సూచించారు.
SHARE IT..


