News December 15, 2025
బాపట్ల: ఎండుమిర్చి దొంగతనం కేసులో నిందితుడికి జైలు

అద్దంకి మండలం రాళ్లపాడుకు చెందిన శ్రీనివాసరావు పొలంలో 2025లో 10 క్వింటాళ్ల ఎండుమిర్చి దొంగలించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష విధించారు. ఒంగోలులోని పేర్నమిట్టకు చెందిన చిరుతోటి మధు(41)కు సోమవారం అద్దంకి జడ్జి అఖిల 6నెలల జైలు శిక్ష విధించినట్లు అద్దంకి C.I సుబ్బరాజు తెలిపారు. దొంగతనం ఘటనపై అప్పటి SI కేసు నమోదు చేశారన్నారు. దర్యాప్తులో నిందితుడు ఉపయోగించిన ఆటోను కోర్టుకు స్వాధీనం చేశామన్నారు.
Similar News
News December 23, 2025
ANU: బీటెక్ రివాల్యుయేషన్ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులైలో జరిగిన బీటెక్ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. I, IV, మొదటి, రెండో సెమిస్టర్, II, IV, మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్
https://www.nagarjunauniversity.ac.in/ చూడాలన్నారు.
News December 23, 2025
REWIND 2025: ప్రపంచంలో ముఖ్య ఘటనలు

*డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం
* కాథలిక్ చర్చి 267వ పోప్గా పోప్ లియో XIV ఎన్నిక
* Gen-Z నిరసనలతో నేపాల్ ప్రభుత్వ మార్పు
* హాంకాంగ్ వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో 161 మంది మృతి
* జమైకాను వణికించిన మెలిస్సా తుఫాను.. మృతులు 102, 9లక్షల మంది బాధితులు
* మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 గెలిచిన భారత్
* US జోక్యంతో ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ
News December 23, 2025
రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు.. ఎప్పుడంటే..?

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమన్న ఆలయ పార్కింగ్ స్థలంలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో భీమన్న గుడిలో పూజలు, అభిషేకాలు, అర్చనలు, కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించిన విషయం తెలిసిందే.


