News December 13, 2025

బాపట్ల: ‘గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు అనుమతివ్వాలి’

image

బాపట్ల MP, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (RT&H) కార్యదర్శి వి.ఉమాశంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలోని “చెందోలు- నిజాంపట్నం – నారోకోడూరు- గుంటూరు” ఫిషింగ్ హార్బర్ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టు DPR అలైన్‌మెంట్‌కు త్వరగా ఆమోదం ఇవ్వాలని MP తెన్నేటి విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 17, 2025

సూర్యాపేట: @ ఒంటిగంట వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

image

సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన 3వ విడత ఎన్నిక పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు.
చింతలపాలెం – 82.59%
గరిడేపల్లి – 87.72%
హుజూర్‌నగర్ – 83.18%
మట్టంపల్లి – 88.97%
మేళ్లచెరువు – 85.08%
నేరేడుచర్ల – 86.14%
పాలకవీడు – 87.60%
జిల్లా వ్యాప్తంగా 86.19% నమోదైందన్నారు.

News December 17, 2025

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

image

జిల్లాలోని 7 మండలాల్లో గల 158 పంచాయతీలు, 1,364 వార్డు స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. అచ్చంపేట, లింగాల, అమ్రాబాద్‌ తదితర మండలాల్లో అధికారులు తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం సర్పంచ్ ఫలితాలను వెల్లడించనున్నారు. మేజర్ పంచాయతీల ఫలితాలు వెలువడటానికి రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని, అనంతరం ఉపసర్పంచుల ఎన్నిక ఉంటుందని అధికారులు తెలిపారు.

News December 17, 2025

ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్- కలెక్టర్ సత్యప్రసాద్

image

జగిత్యాల జిల్లాలో 3విడతలలో భాగంగా 6 మండలాల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, ఎండపల్లి, బుగ్గారం, వెల్గటూర్ మండలాల్లోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలిస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఒంటిగంటలోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.