News March 28, 2025

బాపట్ల జిల్లాకు మంచి రోజులు..!

image

బాపట్ల జిల్లాకు నిన్న ఒక్కరోజే రెండు శుభవార్తలు అందాయి. సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97.52 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చింది. నిజాంపట్నం(M) పరిశవారిపాలెం(దిండి) వద్ద రూ.88.08 కోట్లతో ఆక్వా పార్కు ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి. ఇక్కడ రూ.25.79 కోట్లతో చేపలు, రూ.18.58 కోట్లతో రొయ్యలు, రూ.9.88కోట్లతో పీతలకు బ్లాక్స్ నిర్మిస్తారు. అలాగే రూ.13.78 కోట్లతో సీ ఫుడ్ పార్కు ఇతర పనులు చేపడతారు.

Similar News

News March 31, 2025

నిర్మల్: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. నిర్మల్ జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.

News March 31, 2025

మంచిర్యాల: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

image

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్‌ను తేల్చనుంది. మంచిర్యాల జిల్లాలో త్వరలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ నూతన సంవత్సరంలో జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘కీ రోల్’ కాబోతోంది.

News March 31, 2025

కరీంనగర్: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

image

KNR జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్‌ను ఫైనల్ చేయలేదు. జిల్లాకు 17,500 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.

error: Content is protected !!