News March 28, 2025

బాపట్ల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు ఇవే.!

image

*బాపట్లలో పర్యాటక రంగ విస్తరిస్తుంది: మంత్రి కందుల*మెగా డీఎస్సీకి హాజరయ్యే వారికి ఉచిత శిక్షణ* అధికారులకు బాపట్ల కలెక్టర్ ఆదేశాలు *జిల్లా పోలీస్ అధికారులకు ఎస్పీ కీలక సూచనలు*హెలిప్యాడ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: బాపట్ల కలెక్టర్ * మానవత్వం చాటుకున్న మంత్రి కందుల

Similar News

News November 10, 2025

RGM: బేస్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన సింగరేణి సీఎండీ

image

రామగుండంలోని సింగరేణి సంస్థ ఓసీపీ-5 ఆవరణలో నూతనంగా నిర్మించిన బేస్ వర్క్‌షాప్‌ను సంస్థ సీఎండీ బలరాం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్, అధికారులు ఆయనను సన్మానించారు. అనంతరం సీఎండీ క్వారీలోకి వెళ్లి బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, ఓబీ రిమూవల్‌ను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రాజెక్టుపై నాటిన మొక్కలను కూడా ఆయన పరిశీలించారు.

News November 10, 2025

నేడు భద్రాచలం, కొత్తగూడెంలో ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజల సౌకర్యార్థం సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలపై కలెక్టరేట్ ఇన్‌వార్డ్‌లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

News November 10, 2025

10న యథావిధిగా ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’: కలెక్టర్

image

అమలాపురం కలెక్టరేట్‌లో ఈనెల 10 సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి, ఆర్డీవో, మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.