News March 27, 2025
బాపట్ల జిల్లాలో రాత్రి సమయంలో గస్తీ

బాపట్ల జిల్లా పోలీసులు సమర్థవంతంగా రాత్రి పూట గస్తీ విధులు నిర్వహిస్తున్నారని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి బుధవారం తెలిపారు. ప్రధాన ప్రాంతాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఏటీఎంలు, బ్యాంకులు ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో విస్తృతంగా గస్తీ నిర్వహిస్తున్నారు. గస్తీ నిర్వహించే సిబ్బంది విధులలో అధునాతన సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. ఎవరైనా అనుమానితులు తారస పడితే వారిని విచారిస్తున్నారని చెప్పారు.
Similar News
News November 5, 2025
నిజామాబాద్: ఇద్దరికి జైలు శిక్ష

నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామంలో 2020 సంవత్సరంలో పొలం వివాదంలో గొడవ కారణంగా కేశపురం మహేశ్ పై గడ్డపారతో దాడి చేయగా గగ్గోని నవీన్, గగ్గోని హనుమాన్లుపై కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ స్టేషన్ కోడ్ జడ్జి సాయిసుధా ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి గగ్గోని నవీన్కు ఐదేళ్లు, హనుమాన్లుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారని నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు.
News November 5, 2025
న్యూస్ రౌండప్

* US మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కన్నుమూత
* రాష్ట్ర పరిధిలో తిరిగే ప్రైవేట్ టూరిస్ట్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి, చర్చలకు పిలవాలని AP ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం డిమాండ్
* దుబాయ్లో మంత్రి నారాయణ పర్యటన.. రాష్ట్రంలో పెట్టుబడులకు అపరెల్ గ్రూపుకు ఆహ్వానం
* జూబ్లీహిల్స్ బైపోల్: హోమ్ ఓటింగ్ వినియోగించుకున్న 97 మంది సీనియర్ సిటిజన్లు, వికలాంగులు
News November 5, 2025
అధికారులతో నిర్మల్ కలెక్టర్ సమీక్ష

వర్షాకాలంలో వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతు చేయాలని, పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో చేపట్టిన పనులపై ఆయా ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


