News December 30, 2025
బాపట్ల జిల్లాలో రూ.96.57 కోట్లు అందజేస్తాం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న NTR భరోసా పింఛన్ల సొమ్మును బుధవారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాలో 2026 జనవరిలో 2,25,485 మందికి వివిధ రకాల పింఛన్ దారులకు రూ.96.57 కోట్లు అందజేస్తామని చెప్పారు. మంగళవారం బ్యాంకుల నుంచి నగదు డ్రా చేశామన్నారు.
Similar News
News February 19, 2026
తల్లి పాదాలు కడిగి నీళ్లు తాగిన సీనియర్ హీరో

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవిందా మంచితనం గురించి గతంలో చాలామంది చాలా ఉదహరించారు. తాజాగా ఆయన మేనల్లుడు వినయ్ ఆనంద్ సైతం.. 90s స్టార్ విలువలకు నిదర్శనమని ప్రశంసించారు. ‘మా అమ్మమ్మ నిర్మల ప్రతి బర్త్డేకి మామయ్య ఆమె కాళ్లు కడిగి నమస్కరించి ఆ నీళ్లు తాగేవాడు’ అని తెలిపారు. ఆయన రీల్ లైఫ్, రియల్ లైఫ్ను చాలామంది కాపీ కొట్టారని, అది గోవిందా గొప్పతనమని వెల్లడించారు.
News February 19, 2026
KMR: సహేరి అంటే ఏమిటి? ఇఫ్తార్ విశిష్టత ఇదే..

తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు, అంటే ఫజర్ అజాన్ కంటే ముందే తీసుకునే ఆహారాన్ని ‘సహేరి’ అంటారు. రోజంతా నిష్టగా ఉపవాసం ఉండేందుకు శరీరానికి అవసరమైన శక్తిని ఈ ఆహారం అందిస్తుంది. రోజంతా నీరు కూడా ముట్టకుండా కఠిన దీక్షను పాటించిన అనంతరం, సూర్యాస్తమయం వేళ దీక్షను విరమించడాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. సాధారణంగా ఖర్జూరం లేదా మంచి నీటితో ఉపవాసాన్ని విరమిస్తారు.
News February 19, 2026
తాబేళ్లను మొక్కుబడిగా సమర్పించే దేవాలయం!

అస్సాంలోని హజోలో మణికూట పర్వతంపై విష్ణుమూర్తి హయగ్రీవ రూపంలో పూజలందుకుంటారు. ఇక్కడి కోనేరులో భక్తులు తాబేళ్లను మొక్కుబడిగా సమర్పిస్తారు. తాబేళ్లను కూర్మావతారంగా పూజిస్తారు. బౌద్ధులు ఈ ప్రదేశాన్ని బుద్ధుడు మోక్షం పొందిన ‘మహాముని’ క్షేత్రంగా కొలుస్తారు. క్రీ.శ.1583లో నిర్మితమైన ఆలయ శిల్పకళా సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. మధు, కైటభ రాక్షసులను విష్ణుమూర్తి ఇక్కడే సంహరించారని పురాణాల వాక్కు.


