News January 29, 2025
‘బాపట్ల జిల్లాలో 2024లో 226 మంది చనిపోయారు’

గత 2024 సంవత్సరంలో బాపట్ల జిల్లాలో జరిగిన 500కు పైగా ప్రమాదాలలో సుమారు 226 మంది చనిపోయారని బాపట్ల మోటారు వాహన తనిఖీ అధికారి ప్రసన్న కుమారి చెప్పారు. బుధవారం రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా బాపట్లలోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ గ్రౌండ్లో వాహన దారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వలన ప్రమాదాలలో రక్షణ లభిస్తుందన్నారు. సహాయ అధికారి కిషోర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 13, 2025
ఖమ్మం జిల్లాలో 52,260 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 326 కొనుగోలు కేంద్రాల ద్వారా 52,260 క్వింటాళ్ల నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ తెలిపారు. తల్లాడ, కల్లూరు మండలాల్లో 101 మంది రైతుల నుంచి సేకరించిన 5,134 క్వింటాళ్ల సన్న రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్గా రూ.25.67 లక్షలు 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని ఆయన వెల్లడించారు.
News November 13, 2025
నెల్లూరు ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 65 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. చుట్టు పక్కల వారు గుర్తించి హాస్పిటల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9440700018, 08612328440 నంబర్లకు కాల్ చేయాలని పోలీసులు కోరారు.
News November 13, 2025
శివుడికి మూడో నేత్రం నిజంగానే ఉంటుందా?

శివుడికి మూడో నేత్రం ఉంటుంది. కానీ, చిత్రపటాల్లో చూపించినట్లు అది భౌతికమైనది కాదు. ఆ నేత్రం జ్ఞానానికి, అంతర దృష్టికి సంకేతం. దాని ద్వారానే ఆయన లోకాలను నడిపిస్తున్నాడు. ఆయన అంతటి జ్ఞానవంతుడని తెలిపేందుకే విగ్రహాలు, ఫొటోల్లో ఆ నేత్రాన్ని చూపిస్తారు. జ్ఞానం అనే ఈ మూడో కన్ను మనక్కూడా ఉంటుందని, దాని ద్వారా జీవిత సత్యాన్ని తెలుసుకున్నవారు మోక్షం వైపు అడుగులేస్తారని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#SIVA<<>>


