News January 31, 2026
బాపట్ల జిల్లాలో 61.370 కిలోల గంజాయి స్వాధీనం

బాపట్ల జిల్లాలో మత్తు పదార్థాల మూలాలను గుర్తించి, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 398 కేసులు నమోదు చేసి, 61.370 కిలోల గంజాయిని, ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత నెలలో 3 కేసులు నమోదయ్యాయని, యువతను వ్యసనాలకు దూరం చేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Similar News
News February 21, 2026
మెదక్లో అర్ధరాత్రి విచక్షణారహితంగా దాడి

మెదక్లోని శ్మశానవాటిక సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సజీద్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. శనివారం ఉదయం గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఈఎంటీ రామవ్వ, పైలట్ రఘు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. టౌన్ SI రుక్సానా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News February 21, 2026
వినుకొండ చేరుకున్న CM చంద్రబాబు

సీఎం నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా వినుకొండ చేరుకున్నారు. ‘స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇక్కడ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు అన్ని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
News February 21, 2026
YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆస్తుల వేలం

YCP మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ ఆస్తులను వేలం వేయనున్నట్లు LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ప్రకటించింది. వీరు ఆ కంపెనీ నుంచి గతంలో ₹340Cr లోన్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత వాయిదాలు కట్టడం ఆపేయడంతో బకాయిల మొత్తం ₹782.07Crకు చేరింది. దీంతో వారి ఆస్తుల వేలం ప్రక్రియను LIC ప్రారంభించింది. తాజాగా HYD KPHBలో 3,830 చ.గజాల స్థలం వేలానికి ప్రకటన ఇచ్చింది. దీని కనీస విలువ ₹65Crగా పేర్కొంది.


