News September 6, 2025

బాపట్ల జిల్లాలో 90 వేల హెక్టార్లలో వరి సాగు

image

గత ఏడాది జిల్లాలో 88 వేల హెక్టార్లలో వరి పంటలు సాగు చేయగా, ప్రస్తుతం 90 వేల హెక్టార్లకు వరి సాగు జరిగిందని కలెక్టర్ మురళి శనివారం తెలిపారు. ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో 2.24 లక్షల ఎకరాలలో రైతులు వరి సాగు ప్రారంభించినట్లు తెలిపారు. పంటల సాగును దృష్టిలో ఉంచుకుని 20వేల టన్నుల యూరియా కావాలని అంచనా వేశామన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు 21,609 టన్నుల యూరియా జిల్లాకు విడుదల అయిందన్నారు.

Similar News

News September 6, 2025

పెదఅమిరం: ఆధార్ బయోమెట్రిక్ ప్రక్రియ వేగవంతం చేయాలి

image

కౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, ఈపీటీఎస్ ఫైల్స్ అప్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం పెద అమిరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తల్లికి వందనం ఖాతాలో నగదు జమకు ఉన్న ఆటంకాలను పరిష్కరించాలన్నారు. పిల్లలందరికీ ఆధార్ బయోమెట్రిక్ ను అప్డేట్ చేయాలని సూచించారు.

News September 6, 2025

MHBD: కమ్యూనిటీ మీడియేటర్లు చురుకైన పాత్ర పోషించాలి: జడ్జి

image

కమ్యూనిటీ వివాదాలను పరిష్కరించడంలో చురుకైన పాత్ర పోషించాలని MHBD ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ద్వారా మీడియేషన్‌లో నిపుణులైన న్యాయ కోవిదుల ద్వారా 3 రోజుల శిక్షణ పొందిన కమ్యూనిటీ మీడియేటర్లు తమ వద్దకు వచ్చారన్నారు. మీడియేటర్ల శిక్షణ ముగిసి చాలా కాలమైనప్పటికీ ఇంకా జిల్లాలో మీడియేషన్ సెంటర్లు ఏర్పాటు కాలేదన్నారు.

News September 6, 2025

MHBD: యూరియా బస్తాను ఎత్తిన జిల్లా ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ భారాన్ని పోలీసులు భుజానికెత్తుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం సొసైటీ వద్ద ఈరోజు యూరియా పంపిణీని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షించారు. ఓ మహిళా రైతుకు యూరియా బస్తాను ఆమె భుజానికి ఎత్తారు. రైతులకు సహాయం చేస్తూ పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రశంసలు అందుకుంటున్నారు.