News February 17, 2025
బాపట్ల జిల్లాలో GBS వ్యాధిపై అవగాహన

గిలియన్ బార్ సిండ్రోమ్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ వ్యాప్తిని ఆరికట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపట్టిన అభా కార్డుల నమోదు ప్రక్రియ, గిలియన్ బార్ సిండ్రోమ్ వ్యాధి వ్యాప్తిపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సోమవారం బాపట్ల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో సమావేశం నిర్వహించారు. ప్రజలు వ్యాధి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News February 11, 2026
ఇస్త్రీ చేస్తూ రూ.2లక్షలకు పైగా సంపాదన.. ట్వీట్ వైరల్!

సామాన్య ఇస్త్రీ షాపు యజమాని సంపాదన చూసి ఓ మహిళ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రతిరోజూ వందలాది బట్టల ఇస్త్రీ, డ్రై క్లీనింగ్ ద్వారా నెలకు రూ.2 లక్షలకు పైగా ఆ దంపతులు సంపాదిస్తున్నారని తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు. ఖర్చులు పోను రూ. 2.37 లక్షలు పొందుతున్నారని, ఇది ఐటీ ఉద్యోగి జీతంతో సమానమని తెలిపారు. ఏ వృత్తి అయినా అంకితభావంతో చేస్తే IT కొలువులకు మించిన ఆదాయం పొందవచ్చని వీరు నిరూపిస్తున్నారు.
News February 11, 2026
చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

కేంద్రం ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026’ పేరుతో సరికొత్త చెత్త సేకరణ విధానాన్ని తెచ్చింది. ఇకపై ఇంటి వద్దే వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేయడం తప్పనిసరి. గతంలో మూడు ఉండగా ఇప్పుడు ఒక డబ్బా పెరిగింది. తడి వ్యర్థాలకు గ్రీన్, పొడి వ్యర్థాలకు బ్లూ, ప్యాడ్లు-డైపర్ల కోసం రెడ్, ఇంట్లోని మెడికల్ వ్యర్థాల కోసం నలుపు డబ్బాలను వాడాలి. పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ సులభతరం చేయడానికి ఈ మార్పు చేశారు.
News February 11, 2026
అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని: గవర్నర్

AP: అమరావతి రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా ఉంటుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ ద్వారా అమరావతిని గ్లోబల్ హబ్గా మార్చేందుకు సంకల్పించాం. అమరావతి భవిష్యత్తును నాశనం చేసే ఉద్దేశంతో గత ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చింది. శ్వేతపత్రాల ద్వారా మా ప్రభుత్వం వాటిని ఎండగట్టింది. రాష్ట్ర GSDP రూ.15.91లక్షల కోట్ల నుంచి రూ.17.60లక్షల కోట్లకు పెరిగింది’ అని పేర్కొన్నారు.


