News November 27, 2025
బాపట్ల జిల్లా యువతకు గుడ్ న్యూస్

మంత్రి సత్య ప్రసాద్ సహకారంతో రేపల్లె ABR ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద శుక్రవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి మాధవి తెలిపారు. ఈ మేళాలో 17 బహుళజాతి కంపెనీలు పాల్గొని సుమారు 800ల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి ఆపై చదివి, 18-30 సంవత్సరాల వయసున్నవారు అర్హులన్నారు. వివరాలకు 90323 84374, 96406 95229 నంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News November 27, 2025
బ్యాంకర్లు రుణ లక్ష్యసాధనలో పురోగతి సాధించాలి: ASF కలెక్టర్

బ్యాంకర్లు 2025-26 వార్షిక సంవత్సర రుణ లక్ష్య సాధనలో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం ASF కలెక్టరేట్లో వార్షిక సంవత్సరం 2వ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డీఓ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్లతో కలిసి బ్యాంక్ లింకేజీ రుణాలపై సమీక్షించారు.
News November 27, 2025
FLASH: MHBD: మహమూద్ పట్నం ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

మహబూబాబాద్ జిల్లా మహమూద్ పట్నం పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు రిజర్వ్ చేశారంటూ గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఎలా రిజర్వ్ చేశారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆరుగురు ఎస్టీ ఓటర్లు, ఒకటే వార్డులో ఉంటే, మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు ధర్మాసనం నిలదీసి స్టే విధించింది.
News November 27, 2025
నంద్యాల ఫిజియోథెరపిస్టుకు జాతీయస్థాయి పురస్కారం

నంద్యాల జిల్లా ఫిజియోథెరపిస్టుల సంఘం కార్యదర్శి డాక్టర్ శివ బాలి రెడ్డి జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ గౌరవాన్ని పొందారు.
సదస్సులో సమర్పించిన పరిశోధన పత్రానికి గాను ఆయనకు ఉత్తమ వైజ్ఞానిక పరిశోధన పత్రం పురస్కారం లభించింది. జిల్లాలోని ప్రముఖులు డా. శివ బాలి రెడ్డిని అభినందించారు.


