News December 3, 2025
బాపట్ల: డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యక్తి బలి..!

సంతమాగులూరు మండలం పుట్టావారి పాలెం జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై పట్టాభిరామయ్య వివరాల మేరకు.. రొంపిచర్ల మండలం అచ్చయ్యపాలెం గ్రామానికి చెందిన జాస్తి నాగేశ్వరరావు(54) టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News December 4, 2025
జెరుసలేం మాస్టర్స్ విజేతగా అర్జున్ ఇరిగేశీ

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ సత్తా చాటారు. ఫైనల్లో మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ను ఓడించి జెరుసలేం మాస్టర్స్-2025 టైటిల్ను సొంతం చేసుకున్నారు. తొలుత రెండు ర్యాపిడ్ గేమ్లు డ్రా కాగా మొదటి బ్లిట్జ్ గేమ్లో విజయం సాధించారు. అర్జున్కు టైటిల్తో పాటు దాదాపు రూ.50లక్షల (USD 55,000) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. ఈ 22ఏళ్ల కుర్రాడి స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.
News December 4, 2025
వరంగల్: ఇక ‘గుర్తుల’ ప్రచారం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అభ్యర్థులు గుర్తులు లేకుండానే గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుతం గుర్తులు కేటాయించడంతో ఇక వాటితో ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వారికి కేటాయించిన గుర్తులతో హోరెత్తిస్తున్నారు.
News December 4, 2025
వరంగల్: ఇక ‘గుర్తుల’ ప్రచారం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అభ్యర్థులు గుర్తులు లేకుండానే గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుతం గుర్తులు కేటాయించడంతో ఇక వాటితో ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వారికి కేటాయించిన గుర్తులతో హోరెత్తిస్తున్నారు.


