News November 29, 2025
బాపట్ల: ‘దిత్వా తుఫాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి’

దిత్వా తుఫాను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. దిత్వా తుఫాను హెచ్చరిక నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో శనివారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని కలెక్టర్ సూచించారు. బోట్లను సముద్రంలోకి అనుమతించేది లేదన్నారు. ఆ మేరకు మత్స్యశాఖ అధికారులు, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 3, 2025
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన పెద్దపల్లి డీసీపీ

పెద్దపల్లి మండలం అప్పన్నపేటలోని నామినేషన్ కేంద్రాలను పెద్దపల్లి DCP భూక్య రామిరెడ్డి, పెద్దపల్లి ACP గజ్జి కృష్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలను జరపాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీసీపీ వెంట సీఐ ప్రవీణ్ కుమార్, గ్రామీణ ఎస్సై మల్లేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీలత ఉన్నారు.
News December 3, 2025
మీక్కూడా ఫేవరెట్ కిడ్ ఉన్నారా?

చాలా కుటుంబాల్లో తెలియకుండానే ‘ఫేవరెట్ కిడ్’ ప్రభావం కనిపిస్తుందంటున్నారు నిపుణులు. తల్లిదండ్రుల ప్రేమలో తేడా లేకపోయినా.. చిన్నచిన్న సందర్భాల్లో ఈ పక్షపాతం బయట పడుతుంది. కొన్నిసార్లు ఒకరితో ఎక్కువ ఓపికగా, ఆప్యాయంగా ఉండటం చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది తల్లిదండ్రులు కూడా గ్రహించకపోవచ్చు. తల్లిదండ్రులు తమను తక్కువగా చూస్తున్నారనే భావన పిల్లల్లో నెగెటివ్ ఆలోచనలను పెంచుతుందని చెబుతున్నారు.
News December 3, 2025
కాకినాడ: అక్కడే ఎందుకిలా జరుగుతోంది.. సర్వత్రా చర్చ!

ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ను వరుస ఘటనలు కలవరపరుస్తున్నాయి. తాజాగా చేబ్రోలు PHCలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందడంతో జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పిఠాపురం ఆసుపత్రిలో మహిళ ప్రసవించి చనిపోవడం, కొత్తపల్లిలో పాఠశాలకు తాళం వేయడం, హెడ్మాస్టర్ కులం పేరుతో దూషించడం వంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాలపై డీసీఎం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.


