News February 4, 2025
బాపట్ల: నందిగం సురేశ్కు ధైర్యం చెప్పిన జగన్

విదేశీ పర్యటన ముగించుకొని మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ బాపట్ల మాజీ ఎంపీ నందింగం సురేశ్ను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కార్యక్రమంలో అంబటి, పేర్నినాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
వేములవాడ: ‘బాధ్యతతో మెదులుదాం.. కుటుంబాలకు అండగా నిలుద్దాం’

విధి నిర్వహణ సందర్భంగా బాధ్యతతో వ్యవహరించి కుటుంబాలకు అండగా నిలుద్దామని వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. వేములవాడ పరిధిలోని వ్యాన్ డ్రైవర్లకు అవగాహన శిబిరం నిర్వహించారు. జాగ్రత్తగా వాహనాలను నడిపి వాహనాలతోపాటు తాము కూడా క్షేమంగా ఇంటికి చేరే విధంగా మసులుకుంటామని ఈ సందర్భంగా వారితో ప్రతిజ్ఞ చేయించారు. వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News November 6, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: WINES బంద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం(09-11-2025) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం(11-11-2025) సాయంత్రం 6 గంటల ముగిసేవరకు వైన్స్, పబ్బులు, రెస్టారెంట్లు బంద్ చేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 14 కౌంటింగ్ రోజు కూడా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
News November 6, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: WINES బంద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఆదివారం(09-11-2025) సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం(11-11-2025) సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసేవరకు వైన్స్, పబ్బులు, రెస్టారెంట్లు బంద్ చేయాలని పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 14 కౌంటింగ్ రోజు కూడా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.


