News March 11, 2025
బాపట్ల పీజీఆర్ఎస్కు 89 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 89 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.
Similar News
News December 29, 2025
రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు

ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం (రేపు) ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మార్కెట్లో అన్ని రకాల క్రయవిక్రయాలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఈనెల 31వ తేదీ (బుధవారం) నుంచి మార్కెట్ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయని వివరించారు. ఈ విషయాన్ని గమనించి జిల్లాలోని రైతు సోదరులు, వ్యాపారులు సహకరించాలని అధికారులు కోరారు.
News December 29, 2025
సిరిసిల్ల: ‘గెలిచినా.. ఓడినా లెక్క చెప్పాల్సిందే’

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పోటాపోటీగా సాగాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు గెలిచినా, ఓడినా 45 రోజుల్లో ఎంపీడీవోలకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాగా, చాలామంది అభ్యర్థులు ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. గడువు దాటితే అభ్యర్థులపై వేటు పడే అవకాశం లేకపోలేదు.
News December 29, 2025
రాష్ట్రంలో 66 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


