News March 11, 2025
బాపట్ల పీజీఆర్ఎస్కు 89 అర్జీలు

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 89 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.
Similar News
News March 11, 2025
మెదక్: ‘నిరుద్యోగ యువతి, యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ’

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ వారిచే ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతీ, యువకులు వివిధ స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇవ్వడానికి 12వ బ్యాచ్ ప్రారంభమవుతున్నట్లు మెదక్ జిల్లా యువజన క్రీడాధికారి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15 లోపు మెదక్లోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
News March 11, 2025
అనుమానాస్పద స్థితిలో కొరియన్ సింగర్ మృతి

దక్షిణ కొరియా పాప్ సింగర్ వీసంగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. సియోల్లోని ఆయన నివాసంలో శవమై కనిపించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ అతిగా తీసుకోవడమే కారణమని అనుమానిస్తున్నారు. కాగా గుండెపోటుతో మరణించినట్లు వీసంగ్ ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఇన్సోమ్నియా, హార్ట్సోర్ స్టోరీ వంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.
News March 11, 2025
కొడుకులు పట్టించుకోవడం లేదు.. కలెక్టర్కు దంపతుల ఫిర్యాదు

వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కొడుకులు పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు ఫిర్యాదు చేశారు. దేశి కోడయ్య (91), శివలక్ష్మి (85) దంపతులకు సత్యనారాయణ, కాశీనాథ్ కుమారులున్నారు. ఆస్తులన్నీ తీసుకున్న కొడుకులు వృద్ధాప్యంలో పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వృద్ధులకు న్యాయం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.