News February 28, 2025

బాపట్ల: ‘పెన్షన్‌దారులతో మర్యాదగా ఉండాలి’ 

image

పెన్షన్‌దారులతో మర్యాద పూర్వకంగా ఉండాలని, పెన్షన్‌ పంపిణీ సిబ్బంది కొత్త యాప్ డౌన్ లోడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్నారు. పెన్షన్‌ పంపిణీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించాలన్నారు. శుక్రవారం బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి, జిల్లా అధికారులతో కలిసి కె. విజయానంద్ నిర్వహించిన వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

Similar News

News December 13, 2025

HYD: డిసెంబర్ 19 నుంచి బుక్ ఫెయిర్

image

38వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను ఈ నెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ తెలిపింది. పుస్తక స్ఫూర్తి, బాలోత్సవం, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రాంగణానికి ప్రజాకవి అందెశ్రీ, ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత, పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్‌ గౌడ్‌ పేర్లు నిర్ణయించారు.

News December 13, 2025

జగిత్యాల: ఏం చేశారని విజయోత్సవాలు: విద్యాసాగర్ రావు

image

ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ హాయాంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి కనబడటం లేదని అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, దావ వసంత ఉన్నారు.

News December 13, 2025

ఈనెల 14 నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు: CMD

image

ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ సిబ్బందికి ఆదేశించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలని శనివారం కోరారు. కళాశాల విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు.