News March 16, 2025

బాపట్ల: పొట్టి శ్రీరాములకు ఘన నివాళి

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News November 11, 2025

HNK: ఫిజియోథెరపీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

హనుమకొండ జిల్లా సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ వెంకటరెడ్డి తెలిపారు. పరకాల, శాయంపేట, ఆత్మకూరు, దామెర, వేలేరు, కమలాపూర్, భీమదేవరపల్లి, నడికూడ మండలాల్లో తాత్కాలిక నియామకాలు చేపడతారు. ఈ నెల 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

News November 11, 2025

కొమ్ములవంచలో కత్తిపోట్ల కలకలం

image

కొడుకును పొడుస్తున్నాడని అడ్డుకున్న తల్లిని కత్తితో పొడిచిన ఘటన MHBD జిల్లాలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నర్సింహులపేట(M) కొమ్ములవంచ గ్రామంలో బూరుగండ్ల రవికి పారునంది అర్జున్‌లకు మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ క్రమంలో రవిని కత్తితో అర్జున్‌ను పొడుస్తుండగా అడ్డుకోబోయిన అతడి తల్లి సునీతను చేయి దగ్గర పొడిచాడు. వారిని 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 11, 2025

డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

image

TG: నల్గొండలోని చిట్యాల వద్ద <<18254484>>బస్సు<<>> దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.