News March 22, 2025

బాపట్ల: పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్.!

image

మూత్రవిసర్జన ముసుగులో రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కొత్తపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. బాపట్ల ఎస్కార్ట్ పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఖైదీని చెరుకుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జైలు నుంచి తెనాలి కోర్టులో హాజరుపర్చారు. తిరుగు ప్రయాణంలో గుంటూరు బస్టాండ్‌లో మూత్రవిసర్జన కోసం వెళ్లి ఖైదీ తిరిగి రాలేదు. దీంతో కొత్తపేటలో ఫిర్యాదు చేశారు.

Similar News

News March 22, 2025

సీసీ రోడ్ల నిర్మాణంలో కర్నూలు జిల్లా నం.1: పవన్ కళ్యాణ్

image

సీసీ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఓర్వకల్లు మం. పూడిచెర్ల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తెలిపారు. జిల్లాలో రూ.75 కోట్లతో 117 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణం పూర్తయిందని, దీనికి కలెక్టర్ రంజిత్ బాషాకు అభినందనలు తెలిపారు. అందుకే పూడిచెర్లలో నీటి కుంటల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

News March 22, 2025

నరసరావుపేట: ఈవీఎం గోడౌన్‌ల తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల గోడౌన్‌లలో భద్రపరిచిన ఈవీఎంలను శనివారం తనిఖీ చేశారు. గోడౌన్లలో సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. సాధారణ త్రైమాసిక తనిఖీలలో భాగంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. గోడౌన్‌లలో ఈవీఎంలను భద్రంగా ఉంచాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News March 22, 2025

SCల విషయంలో జగన్ మడమ తిప్పారు: మందకృష్ణ

image

AP: దళితుల మధ్య మాజీ CM జగన్ చిచ్చు పెట్టాలని చూస్తున్నారని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. SCల విషయంలో ఆయన మాట తప్పారని, మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. ‘SC వర్గీకరణ విషయంలో చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు. కానీ అప్పట్లో MP హోదాలో జగన్ SC వర్గీకరణకు సంతకం చేసి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. YCPలో మాలల ఆధిపత్యం కోసం మాదిగలను అణగదొక్కుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.

error: Content is protected !!