News November 17, 2025
బాపట్ల బీచ్ అభివృద్ధికి ఒప్పందం.. వెయ్యి ఉద్యోగాలు వచ్చే ఛాన్స్

విశాఖపట్నంలో జరిగిన CII సదస్సులో గుంటూరు జిల్లా కి చెందిన భ్రమరా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. బాపట్ల సూర్యలంక బీచ్ పరిసర ప్రాంతంలో సుమారు రూ.360 కోట్ల పెట్టుబడితో బీచ్ రిసార్ట్ నిర్మించేందుకు సంస్థ ఛైర్మన్ గల్లా రామచందర్రావు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశం కలుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Similar News
News November 17, 2025
తారా కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

సంగారెడ్డిలోని తారా పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. వివిధ కోర్సుల్లో మొత్తం 285 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆంగ్లంలో 27, తెలుగులో 21, రాజనీతి శాస్త్రంలో 37, ఎం.కాం.లో 26, బోటనీలో 22, కంప్యూటర్ సైన్స్లో 47, ఫిజిక్స్లో 46, మ్యాథమెటిక్స్లో 47, జువాలజీలో 12 సీట్లు ఉండగా అర్హులు ఈ నెల 18లోగా అప్లయి చేసుకోవాలన్నారు.
News November 17, 2025
తారా కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

సంగారెడ్డిలోని తారా పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. వివిధ కోర్సుల్లో మొత్తం 285 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆంగ్లంలో 27, తెలుగులో 21, రాజనీతి శాస్త్రంలో 37, ఎం.కాం.లో 26, బోటనీలో 22, కంప్యూటర్ సైన్స్లో 47, ఫిజిక్స్లో 46, మ్యాథమెటిక్స్లో 47, జువాలజీలో 12 సీట్లు ఉండగా అర్హులు ఈ నెల 18లోగా అప్లయి చేసుకోవాలన్నారు.
News November 17, 2025
కామారెడ్డి ప్రజావాణికి 87 దరఖాస్తులు

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 87 దరఖాస్తులను స్వీకరించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.


